Mudragada : నాపేరు పద్మనాభం కాదు.. పద్మనాభరెడ్డి

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు

Update: 2024-04-30 06:01 GMT

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఇది తధ్యమని ఆయన అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తుని సంఘటనలో...
చంద్రబాబు నాయుడు కాపులకు ద్రోహం చేశారని, అటువంటి వ్యక్తితో పవన్ దోస్తీ కట్టారన్నారు. ఇద్దరు కలిసినా వైసీపీని ఓడించడం అసాధ్యమన్న ముద్రగడ పద్మనాభం, తుని సంఘటన జరిగినప్పుడు అప్పడు వైసీపీలో ఇప్పుడు టీడీపీలో ఉన్న జ్యోతుల నెహ్రూ ఉన్నారని, ఆయనను అడిగి ఎవరు దానికి కారణమో తెలుసుకోవచ్చని పద్మనాభం తెలిపారు. వైసీపీ నేతలు తుని ఘటనకు కారణమని చంద్రబాబు చేస్తున్న ప్రచారం నిజం కాదని ముద్రగడ పద్మనాభం తెలిపారు.


Tags:    

Similar News