కుప్పం కోటలో వైసీపీ వేవ్

కుప్పం మున్సిపాలిటీలో లో వైసీపీ విజయం దిశగా వెళుతుంది. వైసీపీ ఇప్పటికే మూడు చోట్ల విజయం సాధించింది.

Update: 2021-11-17 05:12 GMT

కుప్పం మున్సిపాలిటీలో లో వైసీపీ విజయం దిశగా వెళుతుంది. వైసీపీ ఇప్పటికే మూడు చోట్ల విజయం సాధించింది. ఏడు చోట్ల వైసీపీ ముందంజలో ఉంది. నాలుగు డివిజన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో వైసీపీ నేతల్లో జోష్ నెలకొంది.

ఇప్పటికే నాలుగు చోట్ల....
కుప్పంలో మొత్తం 29 వార్డులుండగా ఇప్పటికే వైసీపీ ఒక వార్డును ఏకగ్రీవం చేసుకుంది. మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపల్ ఛైర్మన్ పదవి పొందాలంటే పదిహేను వార్డుల్లో గెలవాల్సి ఉంటుంది. మరో 11 వార్డుల్లో వైసీపీ విజయం సాధించాల్సి ఉంది. టీడీపీ కూడా నాలుగు డివిజన్లలో ఆధిక్యతను ప్రదర్శిస్తుంది.


Tags:    

Similar News