Ys Jagan : ఇంతటి అభివృద్ధిని ఎప్పుడైనా చూశారా? ఇంత మార్పును ఎవరైనా తీసుకు వచ్చారా?

వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర రెండో రోజుల రాయలసీమలో కొనసాగుతుంది. నంద్యాల సభలో ప్రసంగించారు.

Update: 2024-03-28 13:08 GMT

తాను యాభై ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన మార్పు 75 ఏళ్ల చంద్రబాబు తీసుకొచ్చారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నంద్యాల ఒక జనసముద్రంలా కనిపిస్తుందని అన్నారు. గతంలో చంద్రబాబు పాలన చేసిన మోసాన్ని చూశారన్నారు. ఇటువైపు తాను ఒకడ్నేని అటు వైపు బాబు, ఆయన దత్తపుత్రుడు, బీజేపీతో పాటు పరోక్షంగా కాంగ్రెస్ ఉందన్నారు. జగన్ ను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. ఐదేళ్ల ప్రగతిని ఇంటింటికి తీసుకెళ్లాని జగన్ పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారు కూడా ఆలోచించాలని జగన్ అన్నారు. మీ కుటుంబానికి మంచి జరిగిందని అనుకుంటేనే ఓటేయాలని జగన్ కోరారు. ఇంటికి వెళ్లి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఎన్నికతో మీ కుటుంబాల భవిష్యత్ నిర్ణయం అవుతుందని అన్నారు. మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. గ్రామాలను చూస్తేనే మార్పు అనేది కనిపిస్తుందన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని జగన్ తెలిపారు.

నారా వారి పాలనకు...
నారా వారి పాలన నరసకాసురుడి పాలనను తలపించిందని, దానిని మరొకమారు కోరుకోవద్దని సూచించారు. ప్రతి నెల ఒకటోతేదీన సూర్యోదయానికంటే ముందే వచ్చి పింఛను అందిస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందించామని తెలిపారు. ఎన్నడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అనేక పథకాలను తెచ్చామన్నారు. ప్రతి రూపాయి పేదలకు వెళ్లాలని ప్రభుత్వం భావించిందన్నారు. తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. పొత్తుల మారి, జిత్తుల మారి పార్టీలన్నీ ఏకమవుతున్నాయన్నారు. డబుల్ సెంచరీ సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. యాభై ఎనిమిది నెలల పాలనలోనే ఎన్నో అద్భుతాలను చేసి చూపించామని జగన్ అన్నారు. ఈ పనులను చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నామని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చామన్నారు.
విద్య, వైద్య రంగాల్లో...
పిల్లల చదువులను ఎలా మార్చమో చూడాలన్నారు. పిల్లలకు ఓటు లేదని వారిని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. రేపటి తరం అని, వాళ్లు బాగుపడితే తలరాతలు మారతాయని భావించి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలే మార్చామని, ఇంగ్లీష్ మీడియం పెట్టిందీ జగన్ ప్రభుత్వమేనని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చామన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. వైద్య రంగాన్ని తీసుకుంటే.. ఆసుపత్రులను పూర్తిగా మార్చామన్నారు. వైద్యులను, సిబ్బందిని నియమించి పేదవారికి ఉచిత వైద్యాన్ని అందించగలిగామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా పెంచామని జగన్ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకు వచ్చి ఆరోగ్యభద్రతకు ఈ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
మోసాల బాబు...
చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు అని జగన్ అన్నారు. రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగ అని అన్నారన్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తే బట్టలు ఆరవేయడానికి కూడా తీగలు పనికిరావన్నది ఈ చంద్రబాబు అని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మ్యానిఫేస్టోను చూస్తే అర్థమవుతుందన్నారు. రైతుల రుణమాఫీ చేస్తానని చెయ్యలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అక్కచెల్లెమ్మలను మోసం చేశాడన్నారు. బాబుకు ఓటేస్తే మరో పదేళ్లు వెనక్కు వెళ్లాల్సిందేనని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఇవ్వకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను మోసం చేశాడన్నారు. అందుకే మోసాల పుట్ట చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారని వాటిని నమ్మవద్దని జగన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని, ప్రతి నగరంలో హైటెక్ సిటీ ని నిర్మిస్తానని చెప్పి నాడు అధికారంలోకి వచ్చారన్నారు. 


Tags:    

Similar News