Ys Jagan : అంతా అమరావతి మయమేనా? 143 హామీలకు దిక్కూదివానం లేదా?

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-05-22 07:06 GMT

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రయవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఇస్తారా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ మద్యాన్ని తాగడం తగ్గించడం ద్వారా అమ్మకాలు భారీగా తగ్గాయని అన్నారు. 2019 నుంచి 2024 వరకూ మద్యం విక్రయాలు ఏపీలో గణనీయంగా పడిపోయాయని తెలిపారు. మద్యం తాగించకూడదనే తాము మద్యం ధరలను పెంచామని చెప్పారు. తాగించడం తగ్గడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడామన్నారు. మద్యం దుకాణాలను తమ హయాంలో 33 శాతం తగ్గించామని జగన్ చెప్పారు. ఎవరు కమీషన్ ఇస్తే వారికి మద్యం దుకాణాలు, డిస్టలరీలను ఇచ్చింది చంద్రబాబు హయాంలోనేనని అన్నారు. చిన్న స్థాయి ఎక్సైజ్ ఉద్యోగులను బెదిరించి స్టేట్ మెంట్లను తీసుకుంటున్నారని అన్నారు.

చదరపు అడుగు నిర్మాణానికి 8,931 రూపాయలా?
అమరావతి నిర్మాణంలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. మళ్లీ సచివాలయం, మళ్లీ హైకోర్టు, మళ్లీ అసెంబ్లీ కడతారట అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం హెచ్ఓడీలు, సిబ్బంది ఆరులక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పనిచేస్తున్నారని, కానీ యాభై మూడు లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించాలని చంద్రబాబు ప్లాన్ చేయడం వెనక కూడా కమీషన్లు దాగి ఉన్నాయని చెప్పరు. ప్రస్తుతం సేకరించిన భూములు చాలక మరో నలభై వేల ఎకరాల భూములు కావాలట అంటూ సెటైర్ వేశారు జగన్. మొబలైజేషన్ అడ్వాన్స్ మళ్లీ తీసుకు వచ్చి దోపిడీకి తెరతీశారని జగన్ విమర్శలు కు దిగారు. అడ్వాన్స్ ల కింద పది శాతం ఇచ్చి ఎనిమిది శాతం వెనక్కు తీసుకుంటున్నారని అన్నారు.
హామీలను గాలికి వదిలి...
చదరపు అడగుకు 8,931 తో నిర్మిస్తున్నారంటే నవ్వు వస్తుందని అన్నారు. అమరావతిలో పనులు నిరంరతం కొనసాగాలని చంద్రబాబు కోరుకుంటారని, అప్పుడే కమీషన్లు దండుకోవడానికి వీలవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఆరు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలు నిరుపయోగమేనా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలి పెట్టి, తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాలను రద్దు చేసి అంతా అమరావతి అంటూ అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదని, వసతి దీవెన కూడా లేదన్నారు. ఆరోగ్య శ్రీని కూడా ఎత్తివేశారన్నారు. చంద్రబాబు చెప్పిన 143 హామీలకు దిక్కూదివానం లేదని జగన మండి పడ్డారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరగడానికి ఆస్కారమే లేదన్నారు. 











Tags:    

Similar News