వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.
విచారణ చేపట్టాలని...
ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టున ఆదేశించింది. వారం రోజుల్లో తాము కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది.