Nirmala Sitharaman : రేపు విశాఖకు నిర్మలా సీతారామన్

రేపు విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు.

Update: 2025-09-16 05:31 GMT

రేపు విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమానికి నిర్మలాసీతారమన్ హాజరు కానన్నారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలను వివరించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కొత్త జీఎస్టీతో...
ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీనిపై అవగాహన పెంచడానికి, ప్రజల్లో చైతన్యం నింపేందుకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అలగే స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.


Tags:    

Similar News