Tirumala : ఒక్కసారిగా పెరిగిన రద్దీ... కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్లు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తక్కువగా ఉన్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

Update: 2023-12-15 02:38 GMT

Tirumala devotees

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తక్కువగా ఉన్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్యూ లైన్లన్నీ నిండిపోయి బయట వరకూ భక్తులు వేచి ఉన్నారు. రేపు శనివారం కావడంతో ఈరోజు నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం నాలుగు గంటలకు పైగానే పడుతుంది.

24 గంటల సమయం...
నిన్న తిరుమల శ్రీవారిని 56,049 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,748 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట టీబీసీ కాంప్లెక్స్ వరకూ భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News