"క్యూ" ఏమాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత కొద్ది రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు

Update: 2023-05-18 03:16 GMT

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత కొద్ది రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయటకు క్యూలైన్ విస్తరించి ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్న ప్రసాదాలను పంచుతుంది. నడక దారిన వచ్చిన భక్తులు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా ఐదు గంటలకు పైగానే శ్రీవారి సయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

24 గంటలు.. దర్శనం...
ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూలైన్‌లోకి ఎలాంటి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,207 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,427 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News