Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.

Update: 2023-11-20 03:10 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. భక్తుల సంఖ్య ఈరోజు మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. శని, ఆదివారాలు కావడంతో సహజంగానే తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

పన్నెండు గంటల సమయం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెట్ లేని వారికి సర్వ దర్శనం క్యూ లైన్ లో శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,800 మంది దర్శించుకున్నారు. వీరిలో 25,962 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్ల రూపాయలు అని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News