Tirumala : తగ్గిన భక్తుల రద్దీ... రీజన్ ఇదేనా?

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు.

Update: 2023-12-11 02:56 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు. దీంతో క్యూ లైన్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. కంపార్ట్‌మెంట్లలో అధిక శాతం కూడా ఖాళీగానే ఉన్నాయి. కార్తీక మాసం ముగియనుండటం, తుఫాను ఎఫెక్ట్ తో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 73,091 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,246 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన వారికి శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News