భక్తుల సంఖ్య తగ్గింది అందుకేనట

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. వేసవి సెలవులు ఉన్నప్పటికీ, పది, ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పటికీ తిరుమలలోరద్దీ లేదు

Update: 2023-05-09 02:34 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. వేసవి సెలవులు ఉన్నప్పటికీ, పది, ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పటికీ తిరుమలతో రద్దీ పెద్దగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. నడక దారిన వచ్చి సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం నాలుగు గంటలలో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వ దర్శనం క్యూలై‌న్‌లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం పది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం రెండు నుంచి మూడు గంటలలో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,904 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిలో 29,290 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.57 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. తుపాను హెచ్చరిక, భారీ వర్షాల కారణంగానే భక్తుల సంఖ్య తక్కువగా ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News