నేరుగా దర్శనానికి

తిరుమలలో భక్తుల రద్దీ లేదు. వేసవి సెలవుల్లోనూ తిరుమలలో భక్తుల రద్దీ లేదు

Update: 2023-05-08 02:15 GMT

తిరుమలలో భక్తుల రద్దీ లేదు. వేసవి సెలవుల్లోనూ తిరుమలలో భక్తుల రద్దీ లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండానే నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. నడక దారిన వచ్చిన భక్తులకు నాలుగు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,876 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. వారిలో 30,695 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News