మరికాసేపట్లో లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.

Update: 2023-01-27 02:39 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు రికార్డు స్థాయిలో జరగనుంది. యువగళం పేరిట జరగనున్న ఈ పాదయాత్రకు పోలీసులకు ఆంక్షలతో కూడిన అనుమతులను మంజూరు చేశారు. నేడు కుప్పం నుంచి ఉదయం 11.03 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

బాలకృష్ణ జెండా ఊపి...
నందమూరి బాలకృష్ణ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పంలోని వరదరాజగుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కుప్పంలో భారీ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. పాదయాత్రకు, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


Tags:    

Similar News