హైకోర్టుకు లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు

Update: 2023-09-27 07:48 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. లోకేష్ ను త్వరలోనే ఈ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. లోకేష్ ను అరెస్ట్ చేయడానికి కొందరు సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ముందస్తు బెయిల్...
ఈ నెల 29వ తేదీ నుంచి నారా లోకేష్ యువగళం ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పాదయాత్రకు ముందే ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భావించిన నారా లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు.


Tags:    

Similar News