మహాపాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతుల మహాపాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు.

Update: 2021-12-10 04:26 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రైతుల మహాపాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. 39వ రోజు చేరుకున్న ఈ యాత్రకు ఈరోజు విరామం ప్రకటించారు.

17న తిరుపతిలో...
ఈ నెల 16న పాదయాత్రలో పాల్గొన్న రైతులందరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాలని రైతులు భావిస్తున్నారు. నవంబరు 1న మహా పాదయాత్ర ప్రారంభమయింది. ఈ నెల 16వ తేదీతో ముగియనుంది.


Tags:    

Similar News