నేడు చంద్రబాబు నామినేషన్

కుప్పం నియోజకవర్గంలో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Update: 2024-04-19 04:43 GMT

కుప్పం నియోజకవర్గంలో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన తరుపున సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందచేయనున్నారు. నిన్ననే కుప్పం చేరుకున్న భువనేశ్వరి నేడు కుప్పం లోని ఆలయంలో తొలుత పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి చంద్రబాబు తరుపున అందచేస్తారు.

ఇంటింటికీ ప్రచారం...
కుప్పం నియోజకవర్గంలో తొలి సారి భువనేశ్వరి చంద్రబాబు తరుపున నామినేషన్ పత్రాలను అందచేయనున్నారు. నామినేషన్ కు భారీగా ర్యాలీతో భువనేశ్వరి బయలుదేరి వెళ్లనున్నారు. నామినేషన్ అనంతరం చంద్రబాబుకు మద్దతుగా కుప్పం నియోజకవర్గంలో ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News