Breaking : వైఎస్ సునీతకు షాకిచ్చిన హైకోర్టు

వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది

Update: 2024-05-10 05:33 GMT

వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి తనను బెదిరించారని గతంలో వివేకా పీఏ ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ లపై కేసు నమోదయింది.

కేసును కొట్టివేయాలంటూ...
ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్లను వేశారు. అయితే దీనిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది.


Tags:    

Similar News