Breaking: వివేకా హత్యకేసులో సంచలన ఆదేశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. విచారణ అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించింది.

Update: 2023-03-27 06:40 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. విచారణ అధికారిని మార్చాలని సీబీఐని సుప్రీంకోర్టును ఆదేశించింది. సీబీఐ విచారణ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో అంతా రాజకీయ వైరం వివరాలు తప్ప హత్యకు కుట్ర కోణం ఏంటన్న దానిపై ఎలాంటి వివరాలు లేవని అభిప్రాయపడింది.

రాంసింగ్‌ను మార్చాలని....
దీంతో సీబీఐ విచారణ అధికారి రాంసింగ్ ను మార్చాలని మాత్రం సుప్రీంకోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేశారు. విచారణాధికారి రాంసింగ్ ను మార్చాలంటూ వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటీషన్ పై నేడు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ నిర్ణయాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీలోగా చెప్పాలని ఆదేశించింది. 


Tags:    

Similar News