నారా లోకేష్ కు తలైవా ఫోన్.. ఏమి చెప్పారంటే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు

Update: 2023-09-13 10:37 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో ఆయన కుమారుడు నారా లోకేష్ కు పలువురు ఫోన్ కాల్స్ చేస్తూ పరామర్శిస్తూ ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నారా లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్షగా నిలుస్తుందన్నారు రజినీకాంత్. ఇలాంటి సమయంలో లోకేష్ ధైర్యంతో ఉండాలని సూచించారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. ఆయన కచ్చితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి పలువురు నాయకులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. రజినీకాంత్ ఫోన్ కాల్ వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనుంది. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబు పాలన గురించి రజినీకాంత్ గొప్పగా చెప్పినప్పుడు కూడా వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.


Tags:    

Similar News