చంద్రబాబు భూమి కబ్జా?

చంద్రబాబు సొంత గ్రామంలోని నారావారిపల్లెలో ఆయన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు.

Update: 2022-02-18 05:48 GMT

చంద్రబాబు సొంత గ్రామంలోని నారావారిపల్లెలో ఆయన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఈ భూమిని 1989లో కొనుగోలు చేశారు. నారావారిపల్లెలోని సర్వే నెంబరు 222/5లో 38 సెంట్ల భూమి ఉంది. ఈ స్థలంలో కొంత భూమిని ఆసుపత్రి, కల్యాణ మండపాన్ని నిర్మిందేందుకు విరాళంగా ఇచ్చారు.

38 సెంట్ల భూమిలో....
ఈ భూమిని చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేశారు. ప్రతి ఏటా ఈ భూమిలోనే చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలను జరుపుకుంటుంది. అయితే చంద్రబాబుకు చెందిన 38 సెంట్లలో ఫెన్సింగ్ వేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News