సజ్జల కాన్వాయ్ కు ప్రమాదం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణించే కాన్వాయ్ ప్రమాదానికి గురయింది

Update: 2022-02-19 13:58 GMT

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణించే కాన్వాయ్ ప్రమాదానికి గురయింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. గుత్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు అదుపుతప్పి ఒకటినొకటి ఢీకొన్నాయి. కర్నూలు జిల్లాలో ఒక వైసీపీ నేత ఇంట వివాహానికి హాజరయ్యేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు వెళ్లారు.

పెళ్లికి హాజరై....
పెళ్లికి హాజరై గెస్ట్ హౌస్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వేరే వాహనంలో సజ్జల రామకృష్ణారెడ్డి బయలుదేరి గెస్ట్ హౌస్ కు వెళ్లారు. సజ్జల కాన్వాయ్ ప్రమాదానికి గురయిందని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.


Tags:    

Similar News