సాయిప్రియ సేఫ్.. ప్రియుడితో జంప్

విశాఖలో ఆర్కే బీచ్ లో గల్లంతయినట్లుగా భావిస్తున్న సాయిప్రియ క్షేమంగా ఉంది

Update: 2022-07-27 07:04 GMT

విశాఖలో ఆర్కే బీచ్ లో గల్లంతయినట్లుగా భావిస్తున్న సాయిప్రియ క్షేమంగా ఉంది. అయితే తన ప్రియుడితో కలసి భర్త కళ్లుగప్పి పరారయింది. ప్రస్తుతం ఆమె నెల్లూరులో ఉన్నట్లు బంధువులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నెల్లూరు వెళుతున్నారు. సాయిప్రియ తన భర్త శ్రీనివాస్ తో కలసి విశాఖ బీచ్ కు సోమవారం వచ్చింది. పెళ్లిరోజు కావడంతో సింహాచలం వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి భోజనం చేసిన తర్వాత ఆర్కే బీచ్ కు వచ్చారు.

ఫోన్ లో మాట్లాడుతుండగా...
అయితే భర్త శ్రీనివాస్ ఫోన్ లో మాట్లాడుతుండగా సాయి ప్రియ కన్పించకుండా పోయింది. సముద్రంలో గల్లంతయి ఉంటుందని భావించిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గజ ఈతగాళ్లను రప్పించి సాయిప్రియ కోసం వెతికించారు. హెలికాప్టర్ ద్వారా కూడా వెతికారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. నెల్లూరుకు చెందిన లవర్ రవితో సాయిప్రియ పరారయినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు సాయిప్రియ కోసం నెల్లూరు వెళుతున్నారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో సాయిప్రియ క్షేమంగా ఉన్నట్లు తేలింది.


Tags:    

Similar News