తిరుమలలో హెవీ రష్

తిరుమలలో భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

Update: 2023-05-12 02:20 GMT

TTD

తిరుమలలో భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట టీబీసీ కాంప్లెక్స్ వరకూ క్యూ లైన్‌లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నడకదారిన వచ్చిన భక్తులు సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉన్న వారికి శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,853 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. వీరిలో 33,381 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక రానున్న కాలంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.


Tags:    

Similar News