Tirumala : రద్దీ పెద్దగా లేదు... ఈరోజు దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతుంది. ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు

Update: 2023-11-23 02:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతుంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు వీకెండ్ లో మాత్రమే వస్తుండటంతో గురువారం భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. పెద్దగా భక్తుల సంఖ్య లేకపోవడంతో వసతి గృహాలు కూడా వెంటనే భక్తులకు దొరుకుతున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న వారు ఎక్కువగా తిరుమలకు వస్తున్నారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది.

రెండు గంటల్లో...
నిన్న తిరుమల శ్రీవారిని 65,891 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 22,896 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News