Tirumala : సోమవారమయినా.. తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు

Update: 2024-05-06 02:56 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. వేసవి సెలవులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవిలో తిరుమలలో ఎక్కువ రద్దీ ఎప్పుడూ ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

19 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పంధొమ్మిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈ ఉదయం ఏడుగంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,927 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,196 మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News