Tirumala : ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

Update: 2023-11-24 02:19 GMT

 Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. ఈరోజు ఫిబ్రవరి నెలకు సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా స్వామి వారిని దర్శించుకునేందుకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,096 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూలైన్ విస్తరించింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News