తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది, సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం శ్రీవారి దర్శనం పడుతుంది

Update: 2023-05-11 01:58 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పది, ఇంటర్మీడియట్ ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెల్లడి కావడంతో కొంత భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పన్నెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నడక దారిన వచ్చి సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లోకి ప్రవేశించిన భక్తులకుక మాత్రం శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

18 గంటల సమయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,510 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 29,399 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని వివరించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.50 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటనలో తెలిపారు.


Tags:    

Similar News