రష్ ఏమాత్రం తగ్గలేదే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2023-05-15 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పది, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం, వేసవి సెలవులు కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదిహేడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నడక దారిన వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్‌లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 87,022 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,187 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News