Tirumala : నిండిపోయిన తిరుమల.. క్యూ లైన్లన్నీ కిటకిట

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

Update: 2023-12-18 02:27 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. డిసెంబరులో సెలవులు మురిగిపోకుండా ఉండేందుకు భక్తులు డిసెంబరు చివరి రెండు వారాలను వినియోగించుకుంటున్నారు. అందుకే తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పాటు ఈ ఏడాది చివరి నెల చివరి రెండు వారాలు కొద్దిగా రద్దీగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 74,845 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,122 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News