Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 31 కంపార్ట్మెంట్లలో
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
tirumala darshan
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈరోజు దుర్గాష్టమి కావడంతో పాటు దసరా సెలవులు కూడా ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఇక వాహన సేవలు కూడా ఉండటంతో వాటిని చూసి భక్త జనం తరలించిపోతున్నారు. మాడ వీధుల్లో భక్తులు శ్రీవారి సేవలను వీక్షిస్తున్నారు. వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తజనాన్ని మరింతగా ఆకట్టుకుంటున్నాయి. రంగురంగుల అలంకారలతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అశేష భక్తజనం వాహనసేవలతో పాటు స్వామి వారిని చూసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు.