నేడు రాయలసీమ గర్జన సభ

కర్నూలులో నేడు రాయలసీమ గర్జన సభ జరగనుంది. కర్నూలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు

Update: 2022-12-05 03:49 GMT

కర్నూలులో నేడు రాయలసీమ గర్జన సభ జరగనుంది. కర్నూలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. వైసీపీ మద్దతు ఈ గర్జన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి సభకు ప్రజలు హాజరు కానున్నారు.

వైసీపీ మద్దతుతో...
కర్నూలుకు న్యాయ రాజధానిని కేటాయించాలంటూ ఈ సభను నిర్వహించనున్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News