Purandhreswari : చిన్నమ్మ సీరియస్ డెసిషన్.. రాజకీయాలకు బై.. బై?

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది

Update: 2025-11-05 09:05 GMT

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేశ్ చెంచురామ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ మేరకు కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య సయోధ్య నెలకొనడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీకి దింపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన పుస్తకాలు రాసుకుంటూ, మనవళ్లతో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. రాజకీయాల్లోకి తన కుమారుడు హితేశ్ చెంచురామ్ ను ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించినా కొన్ని అడ్డంకుల కారణంగా అది సాధ్యం కాలేదు.

వచ్చే ఎన్నికల నాటికి పురంద్రీశ్వరి...
ఇప్పుడు దగ్గుబాటి పురంద్రీశ్వరి రాజకీయాల్లో ఉన్నారు. ఆమె రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1990వ దశకంలో రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేత. ఆయన రాజకీయాలకు దూరం కావడంతో పాటు పురంద్రీశ్వరి కూడా అదే నిర్ణయానికి వచ్చేటట్లు కనపడుతుంది. ఆమె కేద్రమంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. ఆమె కూడా ఇక రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుని కుమారుడు హితేశ్ చెంచురామ్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి తమ కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లో కొనసాగేలా చూడాలన్నది కుటుంబ సభ్యుల నిర్ణయంగా కనిపిస్తుంది. అయితే దగ్గుబాటి హితేశ్ చెంచురామ్ ను ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు.
వైసీపీలో చేరినా...
2019 ఎన్నికలకు ముందే దగ్గుబాటి హితేశ్ చెంచురామ్ వైసీపీ లో చేరారు. అయితే నాడు ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన విదేశాల్లో ఎక్కువ కాలం ఉన్నందున కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినందున ఆయన స్థానంలో 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక పురంద్రీశ్వరికి కూడా కేంద్ర మంత్రి పదవి రాకపోవడంతో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి హితేశ్ చెంచురామ్ టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని, ఇందుకు చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాల్లో నడుస్తుంది. దగ్గుబాటి హితేశ్ చెంచురామ్ ను పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.


Tags:    

Similar News