బస్సు ప్రమాద మృతులకు మోదీ పరిహారం

మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు

Update: 2026-03-26 06:00 GMT

మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్నిఅందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

గాయపడిన వారికి...
మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో పదమూడు మంది మరణించగా, 26 మంది వరకూ గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపిన మోదీ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Tags:    

Similar News