ఎంపీల మధ్య ట్వీట్ల యుద్ధం...?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Update: 2022-01-16 12:49 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి రఘురామపై ఈరోజు ట్వీట్ చేశారు. "గుడ్డకాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చుని నన్ను చంపేస్తారు అని ఏడుపు మొహం మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేక చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకి దూకైనా ఎవో తోసేసారు అనే రకం" అంటూ విజయసాయిరెడ్డి రఘురామ కృష్ణరాజును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

రఘురామ ఏమన్నారంటే?
దీనిపై రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. "వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్ కు పంపిస్తే మళ్లీ వచ్చేశాడు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు" అంటూ రఘురామ కృష్ణరాజు విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.


Tags:    

Similar News