సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ సంస్థ
జనసేన పార్టీ కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ శ్రీనివాస్ కు చెందిన సంస్థ సైబర్ నేరగాళ్ల బారిన పడింది.
జనసేన పార్టీ కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ శ్రీనివాస్ కు చెందిన సంస్థ సైబర్ నేరగాళ్ల బారిన పడింది. టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. పార్లమెంటు సభ్యుడు ఉదయ్ శ్రీనివాస్ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్ను నమ్మించి ఏకంగా 92 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపన వివరాలు ఇలా ఉన్నాయి. టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని శ్రీనివాసరావు భావించారు. తాను కొత్త నంబర్ వాడుతున్నానని, అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపారు.