నేడు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం

ఈరోజు కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2023-03-31 02:58 GMT

ఈరోజు కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలిలో మధ్యాహ్నం 2.22 గంటలకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన పంచుమర్తి అనురాధ కూడా ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నలుగురు ఎమ్మెల్సీలు...
పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, రామ్‍గోపాల్ రెడ్డిలు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో శాసనమండలిలో చైర్మన్ ఛాంబర్‍లో చైర్మన్ మోషేన్‍రాజు ప్రమాణస్వీకారం చేయించనున్నారు.


Tags:    

Similar News