బ్రాహ్మణి.. బైక్ రైడింగ్.. అదుర్స్(VIDEO)

నారా బ్రాహ్మణి తాజాగా బైక్ పై లేహ్ లో రైడింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది

Update: 2022-12-01 03:39 GMT

నారా బ్రాహ్మణి.. నందమూరి బాలకృష్ణ కూతురు. నారా లోకేష్ సతీమణి. హెరిటేజ్ ను అంతా తానై నడుపుతున్న యువ పారిశ్రామికవేత్త. ఇలా అన్ని ట్యాగులు ఒకే వ్యక్తికి ఉండటం అరుదు. నారా బ్రాహ్మణి యువ పారిశ్రామికవేత్తగా ఎంతగానో రాణిస్తున్నారు. ఆమె ఆలోచనలతో హెరిటేజ్ మరింత పరుగులు తీస్తుంది. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె పనితీరును తోటి పారిశ్రామికవేత్తలు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.

లేహ్ నుంచి లడక్ వరకూ...
నారా బ్రాహ్మణి తాజాగా బైక్ పై లేహ్ లో రైడింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. బ్రాహ్మణిలో ఈ కోణం కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. లేహ్ నుంచి లడక్ వరకూ బైక్ రైడింగ్ చేసి నారా బ్రాహ్మణి అందరినీ ఆకట్టుకున్నారు. స్పోర్ట్స్ బైక్ ను నడిపిన వీడియోను చూసి నెటిజెన్లు సయితం ఆశ్చర్యపడుతున్నారు. కొండలు, మలుపుల్లో ఆమె బైక్ ను నడిపించిన వీడియో వైరల్ అయింది.


Tags:    

Similar News