మంగళగిరిలో నారా బ్రాహ్మణి

మంగళగిరి పట్టణంలో హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పర్యటించారు.

Update: 2024-02-17 06:53 GMT

మంగళగిరి పట్టణంలో హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పర్యటించారు. వీవర్‌శాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొననారు. టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి ఆమె వీవర్ శాలను ప్రారంభించారు. హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను నారా బ్రహ్మణి పరిశీలించారు.

వీవర్స్ శాలను...
వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుంచే మళ్లీ నారా లోకేష్ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడి చేనేత కార్మికులను ఆకట్టుకునేలా ఆమె పర్యటన కొనసాగుతుంది. నారా బ్రాహ్మణి మంగళగిరి రావడంతో పెద్దయెత్తున టీడీపీ అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు.


Tags:    

Similar News