నేడు లోకేష్ వెంట బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళ పాదయాత్రలో నేడు నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు

Update: 2023-04-07 03:11 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళ పాదయాత్రలో నేడు నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. పాదయాత్ర ప్రారంభం సమయంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఇప్పటికి 800 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర పూర్తయింది.

ఇఫ్తార్ విందులో...
లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న అనంతరం సాయంత్రం హిందూపురం టౌన్ అల్ హిలాల్ మైదానంలో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో బాలకృష్ణ పాల్గొననున్నారు. బాలకృష్ణ పాదయాత్రకు వస్తున్నారని తెలిసి పెద్దయెత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.


Tags:    

Similar News