Turakapalem Deaths Mystery : అంతుచిక్కని మరణాలకు కారణం అతడేనా?
గుంటూరు రూరల్ మండల పరిధిలోని తురకపాలెంలో మరణాలపై మిస్టరీ వీడుతుంది. అనేక కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తన్నారు
గుంటూరు రూరల్ మండల పరిధిలోని తురకపాలెంలో మరణాలపై మిస్టరీ వీడుతుంది. అనేక కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తన్నారు. తురకపాలెం మరణాల కేసులో కీలక మలుపు చోటు చేసుకుందని సమాచారం. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంపైనే ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేసి మరీ పరిశీలిస్తున్నారు. కలుషిత సెలైన్, శక్తిమంతమైన మందులే కారణమని భావిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేసి, వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కలుషిత నీరు, మద్యం తాగడం వల్లనే మరణించారని ఇప్పటి వరకూ అనుమానించిన అధికారులు ఇప్పుడు ఆర్ఎంపీ నిర్వహించిన వైద్యం కోణంలోనూ దర్యాప్తునకు శ్రీకారం చుట్టడంతో మిస్టరీ త్వరలోనే వీడే అవకాశముంది.