మంత్రి రోజాకు అస్వస్థత

శుక్రవారం అర్థరాత్రి మంత్రి రోజా అనారోగ్యానికి గురికాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మంత్రి రోజా

Update: 2023-06-11 05:45 GMT

ఏపీ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాలినొప్పి, వాపుతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని థౌజెండ్ లైట్స్ లో గల అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. శుక్రవారం అర్థరాత్రి మంత్రి రోజా అనారోగ్యానికి గురికాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మంత్రి రోజా చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా కాలినొప్పి, వాపు రావడంతో ఆసుపత్రికి రావాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాలి వాపు తగ్గిందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంత్రి రోజా అస్వస్థతకు గురయ్యారన్న వార్తలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి రోజా త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Tags:    

Similar News