వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే త్రీ క్యాపిటల్స్ బిల్

మూడు రాజధానుల బిల్లులను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే అవకాశముందని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు

Update: 2022-09-09 07:54 GMT

మూడు రాజధానుల బిల్లులను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే అవకాశముందని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. కొత్త బిల్లులను ప్రవేశపెట్టవచ్చన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లనే అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు లేకుండా పోయిందని ఆయన ప్రశ్నించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు...
అమరావతి పేదల రాజధాని కాదని, దెయ్యాల రాజధాని అని ఆయన అన్నారు. మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అమరనాథ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News