నేడు పద్మవిభూషణ్ అందుకోనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మవిభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డును అందుకోనున్నారు.

Update: 2024-05-09 03:19 GMT

మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మవిభూషణ‌్ అవార్డును అందుకోనున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

కుటుంబ సభ్యులతో కలసి....
ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డును ఆయన ఇప్పటి వరకూ అందుకోలేదు. ఈరోజు అవార్డును తీసుకోవడానికి చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.


Tags:    

Similar News