మంగళగిరిలో గెలుపు మాదే..మెజారిటీ ఎంతనేదే?

తాము ప్రజల్లో తిరుగుతున్నామని, ప్రజలు తమకు బాగా సహకరిస్తున్నాకరని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు

Update: 2024-04-27 07:50 GMT

తాము ప్రజల్లో తిరుగుతున్నామని, ప్రజలు తమకు బాగా సహకరిస్తున్నాకరని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు. ప్రజాబలం తమ వైపు ఉందన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే తాము ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తామని నమ్మకం కలుగుతుందని మురుగుడు లావణ్య తెలిపారు.

ఎండలను సయితం...
అవతలి పార్టీ వారు ఎండలకు భయపడి ప్రచారానికి దూరంగా ఉన్నారన్నారు. తాము ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు చేరువవుతున్నామని ఆమె చెప్పారు. సామాన్యుల ఆలోచన మాత్రం గెలిచిన తర్వాత ఎవరు అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో ఉన్నారన్నారు. ఈ సారి కూడా మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News