YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది

Update: 2025-09-24 02:09 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేుపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలలో చర్చించనున్నారు.

సమావేశంలో కీలక అంశాలు...
ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కావాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలతో పాటు పలు ముఖ్యమైన విషయాలపై జగన్ నేతలతో చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News