ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణ స్వీకారం

జమ్మూకశ్మీర్ కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బొంబై హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ.. పదోన్నతిపై ఏపీ హైకోర్టు..

Update: 2023-07-28 07:01 GMT

justice dhiraj singh thakur

ఏపీ హైకోర్టు నూతన సీజే గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ సహా.. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జమ్మూకశ్మీర్ కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బొంబై హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ.. పదోన్నతిపై ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కు ఈయన స్వయానా తమ్ముడు. 1964 ఏప్రిల్ 25న జన్మించిన జస్టిస్ ధీరజ్ సింగ్.. 1989 అక్టోబరు 18న ఢిల్లీ, జమ్ముకశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరొందారు. 2011 లో సీనియర్ న్యాయవాదిగా హోదా పొంది.. 2013 మార్చి 8న జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న బొంబై హైకోర్టుకు బదిలీ అయి సేవలందించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు 6వ సీజేగా పదోన్నతిపై వచ్చారు.


Tags:    

Similar News