Janasena : పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయ కర్తల నియామకం

పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికల సమన్వయ కర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు

Update: 2024-04-11 13:46 GMT

పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికల సమన్వయ కర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు ఆయన సమన్వయకర్తలను నియమించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా కొత్తపల్లి సుబ్బారాయుడును నియమించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసును సమన్వయకర్తగా నియమించారు.

రెండు చోట్ల...
ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో నేతలతో పాటు ఇతర పార్టీల క్యాడర్ ను కూడా సమన్వయం చేసుకుని కూటమి అభ్యర్థులను గెలుపొందేందుకు కృషి చేయాలని ఆయన ఈ నియామకాలు చేపట్టారు. వీరు నేతృత్వంలోనే అక్కడ పార్టీ ఎన్నికల ప్రచారం వంటివి జరగనున్నాయి.


Tags:    

Similar News