Breaking : డీఎస్సీ పై హైకోర్టు కీలక ఆదేశాలు

డీఎస్సీపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై స్టే విధించింది

Update: 2024-02-21 06:11 GMT

డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమంటూ కోర్టు ముందు ప్రభుత్వం తన వాదనను వినిపించింది. దీంతో విచారణను ఎనిమిది వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎస్టీజీ పోస్టుల భర్తీలో బీఈడీ అభ్యర్థులను అనుమంతిచే విషయంలో హైకోర్టు స్టే విధించింది.

స్టే ఉత్తర్వులు ఇస్తూ...
ఇటీవల ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులేనని ప్రకటించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ఎలా అనుమతిస్తారంటూ కొందరు పిటీషన్ వేయడంతో దీనిపై విచారించిన హైకోర్టు దానిపై స్టే విధించింది.


Tags:    

Similar News