ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-03-21 02:17 GMT

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ జడ్జి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడంతో ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు జరగనుంది. ప్రభుత్వ అప్పీల్ ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.

పరీక్ష రద్దు చేయడంతో...
2018 ఎపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విచారణ నేడు జరగనుంది. రెండు సార్లు మూల్యాంకనం జరిగిందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ జడ్జి ఆ పరీక్షను రద్దు చేశారు. విపక్షాలు కూడా పరీక్ష నిర్వహణపై పలు ఆరోపణలు చేశాయి.


Tags:    

Similar News