Chandrababu : నేడు బెయిల్ పిటీషన్ పై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-01-29 03:29 GMT

 telugu desam party chief chandrababu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10వ తేదీన చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

సాక్షులను ప్రభావితం చేస్తారని...
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ప్రభుత్వం దాఖలు చేసిన పిటషన్ లో పేర్కొంది. దీనిపై నేడు విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News